Logo
Download our app
విద్యా కమీషన్ చైర్మెన్ పర్యటన
NEWS   Dec 05,2024 02:34 pm
గురువారం బాసర మండలంలోని బిద్రెల్లి ప్రభుత్వ పాఠశాలను విద్యా కమిషన్ ఛైర్మెన్ ఆకునూరి మురళి సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. ముధోల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, తరగతి గదులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి తనిఖీ చేసి ఆయా పాఠశాలలు వసతి గృహాలలో గల సౌకర్యాలను పరిశీలించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source