సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు
NEWS Dec 05,2024 11:07 am
గ్రామ స్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహిస్తామని వెల్లడించారు. అపరిష్కృతంగా ఉన్న భూమి తగాదాలు, రీ సర్వే అవకతవకలను పరిష్కరించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత జగన్ ప్రభుత్వం కావాలని గ్రామాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.