జగన్ ముడుపులపై విచారణ చేపట్టాలి
NEWS Dec 05,2024 10:53 am
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మాజీ సీఎం జగన్ రెడ్డి రూ. 1750 కోట్ల ముడుపులపై ఏసీబీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆనాడు అదానీ డీల్ పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు వెంటనే విచారణకు ఆదేశించాలని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఏసీబీ ఉందంటూ ఆరోపించారు.