2 వేల కోట్ల ఆస్తిని 12 కోట్లకు అమ్మేశారు
NEWS Dec 05,2024 10:42 am
ఏపీఎస్ఏసీడీఏ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి జగన్ , విజయసాయి రెడ్డిలపై నిప్పులు చెరిగారు. రూ. 2 వేల కోట్ల విలువ చేసే ఆస్తిని కేవలం రూ. 12 కోట్లకు అమ్మేశారని , రూ. 2,689 కోట్ల షేర్ విలువను రూ. 494 కోట్లకే అమ్మేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందని, విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు.