జగనన్న కాలనీలో మెరక పనులపై సమగ్ర విచారణ జరపాలి
NEWS Dec 05,2024 05:30 am
కొత్తపేట నియోజకవర్గంలో జగనన్న కాలనీలో మెరక పనులపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ నాయకులు బాబ్లీ డిమాండ్ చేశారు. కొత్తపేటలో జరిగిన సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో కొత్తపేట నియోజకవర్గంలో రూ. 179 కోట్లు వ్యయంతో 348 ఎకరాలు భూములు కొనుగోలు చేశారు. ఆ భూముల్లో మెరక, భూములు చదును పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.