పంచమి తీర్థానికి ఏర్పాట్లు పూర్తి
NEWS Dec 04,2024 08:57 pm
శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన 6న జరుగనున్న పంచమి తీర్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జె.శ్యామల రావు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి సారే ఊరేగింపుగా అలిపిరి చేరుకుంటుందన్నారు. పంచమి తీర్ధ మండపానికి వేంచేసి అమ్మ వారికి అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు.