ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
NEWS Dec 04,2024 08:23 pm
ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇక నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాపౌట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.