హైద్రాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్
NEWS Dec 04,2024 07:52 pm
టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అత్యంత ముఖ్యమైన సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో గూగుల్ ప్రతినిధి స్పష్టం చేశారు. గూగుల్ తో ప్రధాన అత్యాధునిక సాంకేతిక పెట్టుబడి భాగస్వామ్యాన్ని ముగించడం జరిగిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.