ఎఫ్ఐఈవో చైర్మన్ గా గోపాలకృష్ణన్
NEWS Dec 04,2024 07:50 pm
తమిళనాడుకు చెందిన మెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫ్యాబ్రిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి. గోపాలకృష్ణన్ ఎఫ్ఐఈవో దక్షిణ ప్రాంతీయ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్స్ అనేది వాణిజ్యం , పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే భారతదేశపు ప్రధాన ఎగుమతి ప్రమోషన్ సంస్థ. సంస్థకు దేశవ్యాప్తంగా 17 కార్యాలయాలు ఉన్నాయి.