పంచమి తీర్థానికి భారీ భద్రత
NEWS Dec 04,2024 07:48 pm
శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే పంచమీ తీర్థం కార్యక్రమానికి భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు తిరుపతి ఎస్పీ ఎల్ . సుబ్బా రాయుడు. విడతల వారీగా భక్తులకు పుణ్య స్నానం చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అర్ధరాత్రి నుండి పోలీస్ పహారా కాస్తున్నట్లు తెలిపారు. బందోబస్తు విధులను దైవ కార్యం గా భావించి భక్తిశ్రద్ధలతో నిర్వర్తించాలన్నారు.