పోలీసు కుటుంబాలకు సాయం పెంపు
NEWS Dec 04,2024 08:38 am
హోం మంత్రి వంగలపూడి అనిత కీలక ప్రకటన చేశారు. అమరులైన పోలీసు కుటుంబాలకు అందించే తక్షణ సహాయాన్ని లక్ష రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విధి నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తూ, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మానవతా దృక్ఫథంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.