ఢిల్లీ బీసీ సదస్సును విజయవంతం చేద్దాం: డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్
NEWS Dec 04,2024 08:36 am
HYD: బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో డిల్లీలో జరుగు బీసీల జాతీయ సెమినార్, ధర్నాను విజయవంతం చేయాలని బిసి డాక్టర్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 11, 12 తేదీల్లో బీసీల సమర శంఖారావం పేరిట ఢిల్లీలో జరిగే సదస్సు, ధర్నాకు సంబంధించిన పోస్టర్ ను మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పలువురు బీసీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు.