ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు
NEWS Dec 04,2024 07:38 am
సారంగాపూర్ మండలం చించోలి లోని అర్బన్ పార్క్ లో అటవీశాఖ అధికారులు "ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు " నిర్వహించారు. వన్యప్రాణుల దాడుల వల్ల పశుసంపదకు జరిగిన నష్టపరిహారం చెక్కులను బాదితులకు పంపిణీ చేసారు . అటవీ రక్షణ - అగ్ని ప్రమాదాల నివారణపై స్థానికులకు పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శర్వానన్, డిఎఫ్ ఓ నాగిని భాను డివిజన్ అటవీ క్షేత్రాధికారులు, పాల్గొన్నారు.