శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.32 కోట్లు
NEWS Dec 04,2024 06:29 am
తిరుమల శ్రీవారిని 60 వేల 301 మంది భక్తులు దర్శించుకున్నారు. 20 వేల 222 మంది భక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.32 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈవో జె. శ్యామలా రావు వెల్లడించారు. సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు 8 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.