సూర్యప్రభ వాహనంపై శ్రీ పద్మావతి
NEWS Dec 04,2024 06:09 am
కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మ వారు శ్రీ గోవర్ధన గిరిధారియైన శ్రీ కృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా నారికేళం, కర్పూర హారతులు సమర్పించి శ్రీ పద్మావతిని దర్శించుకున్నారు.