మెట్రో ప్రాజెక్టులకు రూ. 22,507 కోట్లు
NEWS Dec 04,2024 05:52 am
కేంద్ర ప్రభుత్వం ఖుష్ కబర్ చెప్పింది. ఏపీలోని విశాఖ, విజయవాడలో చేపట్టే మెట్రో ఫేజ్ -1 పనులకు గాను రూ. 22,507 కోట్లకు ఆమోదం తెలిపిందని మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా వైజాగ్ మెట్రోను 46.23 కి.మీ, విజయవాడకు 38.40 కి.మీ మేర పనులు చేపట్టనున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు.