గరుడ వాహనంపై సిరులతల్లి
NEWS Dec 04,2024 02:48 am
శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మ వారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి పద్మావతిని సేవించుకున్నారు. గరుడసేవ రోజున అమ్మ వారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేసింది టీటీడీ.