అంగన్వాడీలో పౌష్టికాహారం పంపిణీ
NEWS Dec 04,2024 03:37 am
మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అనంతరం గర్భిణీ మహిళలకు అవగాహన కల్పించి, పౌష్టికహారమైనటువంటి పాలు, గుడ్లు, బాలామృతం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శోభారాణి, అంగన్వాడీ ఆయా జల, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.