మా భూములు మాకే కావాలి
NEWS Dec 03,2024 03:55 pm
కలికోట సూరమ్మ చెరువు కుడికాలువ నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం వారం రోజుల క్రితం ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ మంగళవారం రెవెన్యూ అధికారులు నిర్వహించిన గ్రామసభను బహిష్కరించారు. గోవిందారం రెవెన్యూ పరిధిలోని గోవిందారం, దేశయిపేట, రాజలింగంపేట భూ నిర్వాసిత బాధితులందరూ కలిసి ఈ భూసేకరణ నిలుపుదల చేసి తమకు న్యాయం చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ భూసేకరణలో పూర్తిగా చిన్న, సన్నకారు రైతులు ఉన్నామని తెలిపారు.