5ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభం
NEWS Dec 03,2024 02:48 pm
మెట్లచిట్టాపూర్ సబ్ స్టేషన్లో రూ.68 లక్షలతో నెలకొల్పిన అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సందర్భంగా ఎస్ఈ శాలియా నాయక్ మాట్లాడుతూ.. మెట్లచిట్టాపూర్ సబ్స్టేషన్ ఓవర్ లోడుతో రైతులకు అంతరాయాలు కలుగుతున్న దృష్ట్యా అంచనాలు రూపొందించి పంపిన వెంటనే మంజూరు ఇచ్చిన ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ వల్ల మెట్లచిట్టాపూర్, విట్టంపేట్, రంగారావుపేట్, కేసీఆర్ తండా, ఏఎస్ఆర్ తండా గ్రామాలకు చెందిన సుమారు 2800 మంది రైతులు,లబ్ధి చేకూరుతుందని అన్నారు.