అక్రమంగా తరలిస్తున్న కర్ర పట్టివేత
NEWS Dec 03,2024 04:34 pm
ములుగు: ఎడ్లబండ్లలో అక్రమంగా కలప తరలిస్తుండగా స్వాధీనం చేసుకొని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు ఎఫ్ఆర్వో డోలి శంకర్ తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బండ్లపాడు సమీపంలో కాపు కాయగా 5 ఎడ్లబండ్లలో 7 బిలుగు దిమ్మలు లభ్యమయ్యాయని, ఎడ్లబండ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లి నుంచి ఆ దిమ్మలను తీసుకొస్తున్నామని, వెంకటేశ్వర్లపల్లికి తరలిస్తున్నట్లు వెల్లడించారని తెలిపారు.