ప్రభుత్వ వైఫల్యాలపై జగన్ ఫోకస్
NEWS Dec 03,2024 12:29 pm
వైసీపీ కీలక సమావేశం ఈనెల 4న తాడేపల్లిగూడెంలో జగన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కీలక సమావేశంలో కూటమి సర్కార్ వైఫల్యాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. హామీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించారని, ప్రభుత్వంపై పోరాడేందుకు పూర్తి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని పార్టీ తెలిపింది. జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లతో పాటు కీలక బాధ్యులు హాజరు కానున్నారు.