విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం
NEWS Dec 03,2024 02:46 pm
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ ఆర్.వెంకటేశ్వరరావు, స్థానిక కూరగాయల వ్యాపారి మొబీన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఉత్తమ ఫలితాల సాధన, విద్యార్ధుల హాజరు పెంపునకు అదనపు తరగతులను నిర్వహిస్తున్నామని, కళాశాలకు వివిధ గ్రామాల నుండి విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేకుండానే కళాశాలకు వస్తున్నారని గ్రహించి పరీక్షలకు ముందు 3 నెలల పాటు గత 2 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.