ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటా
NEWS Dec 03,2024 10:43 am
హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు తనపై సీఎం అక్రమంగా కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. లక్ష కేసులు నమోదు చేసినా తాను వెనక్కి తగ్గనని , ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. యాదగిరగుట్ట, మానుకోట, బేగంబజార్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లలో అక్రమ కేసులు బనాయించారని వాపోయారు.