ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్తీకమాస భోజనాలు
NEWS Dec 03,2024 04:18 pm
నిర్మల్ జిల్లా: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్ డిపోలో కార్తీక మాస భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనభోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులలో నూతన ఉత్తేజం తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు.