తిరుమలలో చైర్మన్ ఆకస్మిక తనిఖీ
NEWS Dec 03,2024 09:46 am
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. సామాన్య భక్తుల క్యూ లైన్ వద్దకు వెళ్లారు. వసతి సౌకర్యాల ఏర్పాట్లపై ఆరా తీశారు. ఏటీజీహెచ్ వద్ద ఉన్న స్లాటెడ్ సర్వ దర్శనం ప్రవేశ మార్గం వద్ద పరిస్థితులను , నారాయణగిరి ఉద్యాన వనంలోని షెడ్లను, దివ్య దర్శనం కాంప్లెక్స్ ల వద్ద అమలవుతున్న విధానాల గురించి వాకబు చేశారు. రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ వద్ద భక్తులతో మాట్లాడారు.