సీఎంకు బీజేపీ ఎమ్మెల్యే లేఖ
NEWS Dec 03,2024 04:25 pm
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకేం చేశారో సమాధానం చెప్పాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త డిమాండ్ చేశారు. అభివృద్ధి సంగతి దేవు డెరుగు.. విజయోత్సవాల పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై వెంటనే సమాధానం చెప్పాలని సీఎంకి నేడు బహిరంగ లేఖ పంపారు.