వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళం
NEWS Dec 03,2024 08:40 am
ఆత్రేయపురం మండలం వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మించే నిత్య అన్నదాన పథకం భవన నిర్మాణానికి మంగళవారం విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం వాస్తవ్యులు మారిశెట్టి వరలక్ష్మి కుటుంబ సభ్యులు రూ.51,000 విరాళాన్ని అందజేశారు.దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు.అనంతరం ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు దాత కుటుంబసభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.