సచివాలయాలపై సీఎం సమీక్ష
NEWS Dec 02,2024 12:53 pm
సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనా పరంగా వేగం పెంచారు. గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష చేపట్టారు. రాష్ట్ర అభివృద్దిలో గ్రామ, వార్డులు, సచివాలయాలు కీలకమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా అప్ డేట్ కావాలని స్పష్టం చేశారు సీఎం.