గంజాయి మొక్కల పట్టివేత..
NEWS Dec 02,2024 02:40 pm
కడెం మండలం ఆల్లంపల్లి-బాబానాయక్ తండా ప్రాంతాలలో పత్తి , కంది పంటలలో కంటికి కనపడకుండా అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎస్పి జానకి శర్మిల నేతృత్వంలో పట్టుకున్నారు. గంజాయి సాగు చేస్తే లక్షల రూపాయలు గడించవచ్చని , అదే ఆశతో సాగు చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసినట్లు ఎస్పి వివరించారు. గంజాయి మొక్కలు సుమారు 70 లక్షలు రూపాయలు అంచనా. గంజాయి సాగు చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిచ్చినట్లు తెలిపారు.