రేషన్ మాఫియా బిగ్ స్కాం
NEWS Dec 02,2024 08:55 am
రాష్ట్రంలో జరిగిన రేషన్ మాఫియా స్కాంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని అన్నారు. పోర్టుల వద్దకు వెళ్లి హడావుడి చేయడం మానేసి ముందు ఏం జరిగిందో , ఎంత మేరకు అక్రమంగా బియ్యం తరలించారనే దానిపై శ్వే పత్రం విడుదల చేయాలని స్పష్టం చేశారు. రూ. 48 వేల కోట్లు ఎవరి బొక్కలోకి వెళ్లాయో చెప్పాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందన్నారు.