ఇంట్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
NEWS Dec 02,2024 08:31 am
మెట్ పల్లి పట్టణంలోని గాజులపేటకు చెందిన కుంచపు వెంకటేశ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆత్మహత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.