తిరుపతి వాసులకు టోకెన్లు పంపిణీ
NEWS Dec 02,2024 03:10 am
తిరుపతి వాసులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు టోకెన్లు పంపిణీ చేశారు. స్థానికులకు దర్శనం కల్పించేలా చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని నూతన టీటీడీ పాలక వర్గం తీర్మానం చేసింది. ఈ మేరకు టోకెన్లు పంపిణీ చేశామన్నారు బీఆర్ నాయుడు.