జామ మసీద్ కమిటీ అధ్యక్షునిగా రఫీ
NEWS Dec 01,2024 11:23 am
మల్లాపూర్ మండల కేంద్రంలోని జామా మసీద్ కమిటీ అధ్యక్షుడిగా మహ్మద్ రఫీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ రఫీ కృతజ్ఞతలు తెలిపారు.అలాగే సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యక్షునిగా షేక్ పాషా, కోశాధికారిగా ఎండి అప్సర్ షేక్ రఫీ, ప్రధాన కార్యదర్శిగా షేక్ చాంది, సంయుక్త కార్యదర్శిగా ఎండి అంకుశం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.