ప్రజపాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?
NEWS Dec 01,2024 12:14 pm
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారo లోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న ప్రజలకు ఒరిగింది ఏమి లేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య అన్నారు. జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ 6 గ్యారంటీల అమలులో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యo తప్ప మిగతా హామీలను అమలు చేయలేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సంబరాలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 2లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయలేదని అన్నారు.