కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్షీట్
NEWS Dec 01,2024 10:34 am
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆరు అబద్దాలు 66 మోసాలు అంటూ ఇందులో పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెర వేర్చలేదని ఆరోపించారు. హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన మీరు ఏ ఒక్కటి అమలు చేయకుండా విజయోత్సవాలు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు.