ఈసీ పీఎం మోడీకీ గులాం
NEWS Dec 01,2024 08:53 am
మరాఠా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భాయ్ జగ్తాప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పీఎం మోడీని ఉద్దేశించి భగ్గుమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మోడీకి గులాంగిరీ చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీంతో భాయ్ జగ్తాప్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ సీనియర్ నేత కిరీటి సోమయ్య. మోడీకి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా తాను సారీ చెప్పే ప్రసక్తి లేదన్నారు భాయ్ జగ్తాప్.