Logo
Download our app
కురుస్తున్న వర్షాలు..నీట మునిగిన వరి చేలు
NEWS   Dec 01,2024 07:24 am
ఫెంగల్ తుఫాన్ రైతులకు తీరని నష్టాన్ని కలిగించింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పలుచోట్ల పంట పొలాలు ముంపు బారిన పడడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేశారు. ఇంతవరకు 94,597 ఎకరాల్లో కోత కోసి నూర్పిడి చేశారు. మిగిలిన పంట కోత దశకు వచ్చింది. ఈ దశలో భారీ వర్షం రైతులను నిండా ముంచింది.
⚠️ You are not allowed to copy content or view source