తుఫాన్ ఎఫెక్ట్ రెడ్ అలర్ట్
NEWS Dec 01,2024 02:13 am
ఫెయింజల్ తుపాను ప్రభావంతో ఏపీ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అవరసమైతే తప్పా బయటకు రావద్దంటూ కోరింది. సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను అందుబాటులో ఉంచు కోవాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మంత్రి అనిత పరిస్థితిపై ఆరా తీశారు.