తెలంగాణ వాటా దక్కించుకోవాలి
NEWS Nov 30,2024 02:47 pm
కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించు కోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని నీటి పారుదల శాఖాధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన రికార్డులు, ఉత్తర్వులు, సాక్ష్యాధారాలన్నీ సిద్ధంగా ఉంచాలని న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు.