సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం
NEWS Dec 01,2024 06:41 am
ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీ చేసినందుకు హర్షిస్తూ శనివారం మల్లాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. 4వ విడతలో 1304 మంది రైతులకు గానూ 12,65,21,561 మంజూరు అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పలత - నర్సయ్య, ఎలాల జలపతి రెడ్డి, నారాయణ రెడ్డి,రాజన్న, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.