Logo
Download our app
విద్యార్థులకు క్రీడా పోటీలు
NEWS   Dec 01,2024 06:45 am
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తుందని క్రీడల్లో రాణిస్తే విద్య ,ఉద్యోగ రంగాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో చైర్మన్ ఈశ్వర్, ట్రస్మా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source