పాము కాటుతో రైతు మృతి
NEWS Nov 27,2024 01:23 pm
సామర్లకోట మండలం హుస్సేన్పురం గ్రామానికి చెందిన వీరవెంకట సత్యనారాయణ (58)రోజు వారి మాదిరిగానే బుధవారం పొలానికి వెళ్లాడు. పనులు చేస్తుండగా పాము కాటేయడంతో హుటాహుటిన సామర్లకోట ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వీరవెంకట సత్యనారాయణ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.