భార్య రావడం లేదని ఆత్మహత్య
NEWS Nov 26,2024 05:36 am
భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాలు.. కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన అందె రాము (32) భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.