పోస్టల్ ఖాతా ద్వారా పథకాల నగదు
NEWS Nov 25,2024 03:41 pm
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పొందే సంక్షేమ పథకాల నగదును పోస్టల్ ఖాతా ద్వారా పొందవచ్చునని రాజమహేంద్రవరం తపాలా పర్యవేక్షణ అధికారి కె శేషారావు చెప్పారు. మండపేటలో సీతారామ కళ్యాణ మండపం వద్ద సోమవారం తపాలా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్పీసీఐ ప్రత్యేక క్యాంపుని ఆయన సందర్శించి మాట్లాడారు. సంక్షేమ పథకాల నగదును పోస్ట్ ఆఫీస్లో కేవలం 200 రూపాయలతో ఓపెన్ చేసి ప్రతి ఒక్కరూ పొందవచ్చన్నారు.