రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
NEWS Nov 24,2024 06:58 am
రఘునాథపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని గబ్బెట గ్రామానికి చెందిన రాంబాబు గౌడ్ అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా యశ్వంతపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..