ఫలితాల్ని ఊహించలేదు: రాహుల్
NEWS Nov 23,2024 03:22 pm
మహారాష్ట్ర ఫలితాల్ని ఊహించలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఓటమిపై సమీక్షించుకుంటామన్నారు. ఝార్ఖండ్లో భారీ మెజారిటీ ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇండియా కూటమి సాధించిన ఈ విజయం రాజ్యాంగ పరిరక్షణతోపాటు సహజ వనరుల పరిరక్షణ విజయంగా అభివర్ణించారు. ఝార్ఖండ్లో JMM 28 సీట్లలో గెలిచి మరో 6 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 11 చోట్ల గెలిచి 5 చోట్ల లీడ్లో ఉంది.