నిర్మల్ జిల్లా వాసికి అవార్డు
NEWS Nov 21,2024 09:11 am
నిర్మల్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన పొనుగోటి ప్రకాష్ రావు వరల్డ్ కల్చరల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ కమిషన్ డాక్టరేట్ అవార్డుకు ఎంపిక చేసింది. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్వాహకుల చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డును అందుకున్నారు. పలు సామాజిక సేవ కార్యక్రమాలు చేసినందుకు డాక్టరేట్ రావడం పట్ల ప్రకాష్ రావును జిల్లాకు చెందిన పలువురు అభినందించారు.