ఘనంగా లక్ష్మినరసింహస్వామి కళ్యాణం
NEWS Nov 21,2024 02:43 am
నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యానగర్ లో కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న శ్రీవైష్ణవ ఆయుత చండీ అతిరుద్ర మహాయాగం వైభవంగా కొనసాగుతోంది. వేద పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల నడుమ బుధవారం రాత్రి లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం భక్తులకు కనువిందు చేసింది. శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక బస్సులలో తలివచ్చారు.