Logo
Download our app
ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం సీరియస్
NEWS   Nov 20,2024 05:53 pm
TG: నారాయణపేట జిల్లాలోని జడ్పీ స్కూల్‌లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source